మాల్దీవ్స్​ ఎన్నికల్లో మొయిజ్జు పార్టీ ఘన విజయం

మాల్దీవ్స్​ ఎన్నికల్లో మొయిజ్జు పార్టీ ఘన విజయం
  •     చైనా అనుకూల పీపుల్స్​ నేషనల్​ కాంగ్రెస్​కే ప్రజల పట్టం

మాలె: మాల్దీవుల ఎన్నికల్లో ప్రజలు చైనా అనుకూలిడిగా పేరొందిన మహ్మద్​ మొయిజ్జుకే మరోసారి పట్టం కట్టారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మొయిజ్జుకు చెందిన పీపుల్స్​ నేషనల్​ కాంగ్రెస్​ (పీఎన్​సీ) పార్టీ ఘన విజయం సాధించింది. మాల్దీవుల పార్లమెంట్​లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్​ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించగా.. 93 స్థానాలకుగానూ మొయిజ్జు నేతృత్వంలోని సంకీర్ణ కూటమి 71 సీట్లలో విజయం సాధించింది. 

పీఎన్​సీ 68 సీట్లు కైవసం చేసుకోగా, సంకీర్ణ భాగస్వాములైన మాల్దీవ్స్​ నేషనల్​ పార్టీ (ఎంఎన్​పీ)కి ఒకటి,  మాల్దీవ్స్​ డెవలప్​మెంట్​ అలయన్స్​ (ఎండీఏ) రెండు స్థానాల్లో విజయం సాధించాయి.  భారత్​కు అనుకూలంగా ఉండే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్​ సోలెహ్ నేతృత్వంలోని మాల్దీవియన్​ డెమొక్రటిక్​ పార్టీ (ఎండీపీ) 15 సీట్లకే పరిమితమైంది.