కంప్లీటైన మూన్ మిషన్
బీజింగ్: చంద్రుడిపై పరిశోధనల కోసం చైనా చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఆ దేశం పంపిన చాంగ్ఇ–5 స్పేస్క్రాఫ్ట్ చంద్రుడిపై ఉండే రాళ్లను, మట్టిని భూమిపైకి గురువారం తీసుకొచ్చింది. ఇలాంటి ప్రయోగం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. చాంగ్ ఇ–5 ఇన్నర్ మంగోలియాలోని సిజివాంగ్లో దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. తమ మిషన్సక్సెస్ అయిందని, క్యాప్సూల్ విజయవంతంగా కిందికి దిగిందని ఈ సంస్థ హెడ్ జాంగ్ కెజియన్ ప్రకటించారు. చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయడం, దానిపై ల్యాండ్ కావడం, శాంపిళ్లను తీసుకురావడం.. ఈ మూడు పనులను పూర్తి చేయడానికి సీఎన్ఎస్ఏ 2004లో స్పెషల్ మిషన్ను మొదలుపెట్టింది. చాంగ్ ఇ–5 స్పేస్క్రాఫ్ట్ను ఈ ఏడాది నవంబరు 24న ప్రయోగించింది. ఎనిమిది టన్నుల బరువుండే ఈ స్పేస్క్రాఫ్ట్లో నాలుగు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్చంద్రుడిపై డాకింగ్ స్టేషన్గా పనిచేస్తూ ప్రయోగాలు నిర్వహిస్తుంది. రెండోది చందమామ ఉపరితలంపైకి వెళ్లి తవ్వకాలు జరిపింది.మూడోది శాంపిళ్లను డాక్ స్టేషన్కు తీసుకొచ్చింది. నాలుగో క్యాప్సూల్స్టేషన్లోని శాంపిళ్లను భూమిపైకి మోసుకొచ్చింది. శాంపిళ్లను సీఎన్ఎస్ఏ రీసెర్చ్ టీమ్ బీజింగ్ తీసుకెళ్లి పరిశోధనలు చేస్తుంది.
For More News..