
- ప్రతి నలుగురు కొత్త షుగర్ పేషెంట్లలో ఒక్కరు 40 ఏండ్ల లోపువారే!
- 18 ఏండ్లలోపు చాలామందికి టైప్-2 డయాబెటిస్
- అమ్మాయిల కంటే అబ్బాయిలకే షుగర్ ముప్పు
- లైఫ్స్టైల్, ఒబెసిటీ ప్రధాన కారణం
- పీజీఐఎంఈఆర్ చండీగఢ్ స్టడీలో వెల్లడి
చండీగఢ్: షుగర్ వ్యాధి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని కొత్త పరిశోధనలో తేలింది. డయాబెటిస్ బారిన పడుతున్న ప్రతి నలుగురు పేషెంట్లలో ఒకరు 40 ఏండ్ల వయస్సులోపు వారేనని సైంటిస్టులు గుర్తించారు. యువతకు కూడా షుగర్ ముప్పు అధికంగానే ఉన్నట్టు తేల్చారు. దీనికి జీవన విధానంతో, ఒబెసిటీ ప్రధాన కారణమని కనుగొన్నారు. దేశంలోని పట్టణ జనాభాలో 70 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఈఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) పరిశోధకులు గుర్తించారు. 18–65 ఏండ్ల మధ్య వయసున్న వారిపై స్టడీ చేసి, ఈ విషయాలను తేల్చారు. దేశంలో 60% మంది షుగర్ పేషెంట్లు ఊబకాయులేనని గుర్తించారు. ఇందులో 25–30% మంది బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కంటే ఎక్కువగా ఉన్నదని నిర్ధారించారు.
ఒబెసిటీనే అన్ని రోగాలకు కారణం
అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయం ముప్పు వాటిల్లుతున్నదని, ఫలితంగా డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతున్నదని పీజీఐఎంఈఆర్కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూనమ్ ఖన్నా తెలిపారు. ఒబెసిటీతోనే డయాబెటిస్, హైబీపీ, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి నాన్ కమ్యూనికేబుల్డీసీజెస్ (ఎన్సీడీ) పెరిగిపోతున్నట్టు చెప్పారు. ఒబెసిటీలో భారత్.. అమెరికా, చైనా తర్వాత టాప్10లో ఉన్నదన్నారు. చండీగఢ్లో 20.4% మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్టు తమ స్టడీలో తేలిందని తెలిపారు. 18 ఏండ్లలోపు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తున్నదని గుర్తించామన్నారు. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకొని, నిత్యం ఎక్సర్సైజ్ చేస్తే హైబీపీ, హార్ట్ డిసీజెస్తోపాటు 80 శాతం వరకు టైప్ 2 డయాబెటిస్ను తగ్గించుకోవచ్చని తెలిపారు. 5–10 కిలోల బరువు తగ్గినా డయాబెటిస్తోపాటు కొన్ని రోగాల ముప్పునుంచి తప్పించుకోవచ్చని లేదా పూర్తిగా తగ్గించుకోవచ్చని సూచించారు.