చెన్నై: వరదలో కొట్టుకుపోతున్న తల్లీకొడుకుల్ని కొందరు సాహసం చేసి కాపాడిన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. సేలంలోని అనైవరి ముత్తల్ జలపాతానికి పర్యాటకంగా మంచి పేరు ఉంది. దీంతో టూరిస్టులు ఆ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా అక్కడ భారీగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఓ తల్లీకొడుకు చిక్కుకుపోయారు. భారీ నీటి ప్రవాహానికి బయట పడలేకపోయిన ఆ మహిళ.. బిడ్డను పట్టుకుని కొండరాయి ఆసరాగా సాయం కోసం నిలబడింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు.. రోప్ సాయంతో వారిని సురక్షితంగా పైకి చేర్చారు.
தாயையும் சேயையும் காப்பாற்றியவர்களின் தீரமிக்க செயல் பாராட்டுக்குரியது; அரசால் சிறப்பிக்கப்படுவார்கள்.
— M.K.Stalin (@mkstalin) October 26, 2021
தன்னுயிர் பாராது பிறரது உயிர் காக்க துணிந்த அவர்களது தீரத்தில் மனிதநேயமே ஒளிர்கிறது!
பேரிடர்களின்போது பொதுமக்கள் கவனமுடன் இருக்க வேண்டும்.
பண்புடையார்ப் பட்டுண்டு உலகம்! pic.twitter.com/NRCb8OE8l3
అధికారులు రోప్ సాయంతో కాపాడేందుక వచ్చిన సమయంలో వాటర్ఫాల్కు అవతలి వైపు ఉన్న మరికొందరు అరుస్తూ ఉండటాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సీఎం ఎంకే స్టాలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తల్లీకొడుకును సేఫ్గా బయటకు తీసుకొచ్చిన అధికారులను ఆయన మెచ్చుకున్నారు. అయితే తల్లీబిడ్డను కాపాడే క్రమంలో ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఒకరిద్దరు అధికారులు అదుపు తప్పి నీటి ప్రవాహంలో పడ్డారు. వాళ్లు ఈదుకుంటూ సురక్షితంగా బయట పడ్డారని సమాచారం. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలవ్వలేదని సేలం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె. గౌతమ్ తెలిపారు.