Viral video: అరుదైన ప్రకృతి అద్భుతం..బీహార్ మధుబన్ నుంచి..కనువిందు చేసిన ఎవరెస్ట్ శిఖరం

Viral video: అరుదైన ప్రకృతి అద్భుతం..బీహార్ మధుబన్ నుంచి..కనువిందు చేసిన ఎవరెస్ట్ శిఖరం

క్లియర్​స్కై..కొన్ని నెలల తర్వాత క్రిస్టల్​క్లియర్ స్కై..ఎప్పుడూ కాలుష్యం, మంచు, మబ్బులతో కనిపించే ఆకాశం స్పష్టంగా అద్దంలా మెరిసిపోయింది. వెండితో చేసినట్లు తెల్లని మంచుతో కప్పబడిన అందమైన పర్వత శిఖరాల వరుస .. అద్భుతం.. చెప్పడం కాదు.. చూస్తుంటే తెలుస్తుంది..ఆ అరుదైన ప్రకృతి సౌందర్యం..హిమాలయ పర్వతాల్లో ఎత్తయిన పర్వత శిఖరం.. ఎవరెస్ట్​శిఖరం, దాని పర్వతాల శ్రేణి.. బీహార్​ లోని మధుబన్​ జిల్లాలో జయానగర్​ప్రజలకు కనువిందు చేసింది. 

బీహార్‌లోని మధుబని జిల్లాలోని సరిహద్దు పట్టణమైన జయనగర్ నివాసితులకు అద్భుతమైన దృశ్యాన్ని అందించింది ఎవరెస్ట్ శిఖరం..క్షితిజ సమాంతరంగా మెరుస్తున్న గంభీరమైన హిమాలయ శ్రేణి. నేపాల్‌లోని ఒక హిమానీనదం నుంచి ఉద్భవించే కమ్లా నది వెంబడి ఉన్న జయనగర్ ప్రజలు.. మంచుతో కప్పబడిన ఎవరెస్ట్​ శిఖరాలను చూసి మైమరచిపోయారు. 

సముద్ర మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరం.. నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లోని సోలుఖుంబు జిల్లాలో ఉంది. జయనగర్ నివాసితులు మహాలంగూర్ హిమాలయ శ్రేణి లో మంచుతో నిండిన శిఖరాలతో పాటు ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్​ శిఖరం మంచుతో కప్పబడి తలతలా మెరిసిపోతున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించి వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్​ చేశారు. ఆ అద్భుతమైన దృశ్యాలను ఇంటర్నెట్ లో షేర్​చేయడంతో చర్చనీయాంశం అయింది. 

►ALSO READ | దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ డౌన్.. ఆగ్రహంతో రెచ్చిపోతున్న నెటిజన్లు

మొదటిసారి కాదు..

2020లో COVID-19 లాక్‌డౌన్ సమయంలో కూడా ఉత్తర భారతదేశం అంతటా కాలుష్య స్థాయిలు బాగా పడిపోయినప్పుడు ఇలాంటి దృశ్యం కనిపించింది. గాలి అనూహ్యంగా శుభ్రపడటం.. తెరాయ్ మైదానాలు, హిమాలయాల మధ్య అతి తక్కువ పొగమంచు  ఉండటం, మేఘాలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ అద్భుత దృశ్యాలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ  స్వచ్ఛమైన గాలి అద్భుతమైన ప్రకృతి అందాలను మానవ కళ్ళకు ఎలా దగ్గరగా తీసుకురాగలదో గుర్తు చేస్తుంది.