దళిత, ఆదివాసీ ఉద్యమాలు

దళిత, ఆదివాసీ ఉద్యమాలు
  • దళితుల అభ్యున్నతి కోసం భాగ్యనగర్ పత్రికను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. 
  • ఆది హిందువుల చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి భాగ్యరెడ్డి వర్మ 1925లో చేతివృత్తుల ప్రదర్శనను నిర్వహించారు. 
  • 1927లో అలహాబాద్​లో జరిగిన అఖిల భారత నిమ్నవర్గాల సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ దక్షిణ భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు.
  • 1927 నుంచి 1931 వరకు జరిగిన జాతీయ నిమ్నవర్గాల సభలకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించాడు.
  • లండన్​లో జరిగే రెండో రౌండ్​ టేబుల్​ సమావేశానికి దళిత ప్రతినిధిగా అంబేద్కర్​ను పంపాలని 1931 లక్నోలో జరిగిన జాతీయ నిమ్నవర్గాల సదస్సు తీర్మానించింది.
  • 1931 లక్నోలో జాతీయ నిమ్నవర్గాల సదస్సులో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని డిమాండ్​ చేసింది. 
  • హైదరాబాద్​లోని చాదర్​ఘాట్​ వద్ద ఆది హిందూ భవనాన్ని భాగ్యరెడ్డి వర్మ సొంతంగా స్థాపించారు.
  • పంచములు, అవర్ణులు, మాల, మాదిగ, డక్కలి, సింధూ పేర్లతో కూడా తమనకు ఆది హిందువులు అనే పేరుతో పిలవాలని నిజాం ప్రభుత్వాన్ని భాగ్యరెడ్డి వర్మ కోరారు. 
  • 1931 జనాభా లెక్కల్లో నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా నమోదు చేసింది.
  • జంతుబలికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ జీవదయ ప్రచార సభ స్థాపించింది. 
  • 1925లో కలరా, ప్లేగ్​ వ్యాధులు విజృంభించినప్పుడు భాగ్యరెడ్డివర్మ ఆరోగ్య సేవాదళ్​ స్థాపించారు.
  • భాగ్యరెడ్డి వర్మ చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు వర్మ అనే బిరుదు బాజి కిషన్​ రావు అనే బిరుదు ఇచ్చాడు. 
  • ఆదివాసీ ప్రాంతాల్లోకి నిజాం, బ్రిటిష్​  ప్రభుత్వాలు 18వ శతాబ్దం నుంచి జోక్యం చేసుకోవడం ప్రారంభించాయి.
  • నిజాం ప్రభుత్వం 1844లో మైనింగ్​ కోసం హైదరాబాద్​ నుంచి పాల్వంచ వరకు రైల్వే మార్గాన్ని నిర్మించింది. 
  • చాందా – బలార్షా మధ్య రైల్వే లైను నిర్మాణం 1924లో జరిగింది. 
  • హైదరాబాద్​ – పాల్వంచ, చాందా– బలార్షా రైల్వే లైన్ల నిర్మాణం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి ఆదివాసేతర ప్రజలు భారీగా వలస వెళ్లి, ఆదివాసీ ఆస్తులు ఆదివాసేతరుల అధీనంలోకి వెళ్లాయి. 
  • నిర్మల్​, ఆదిలాబాద్​ ప్రాంతాలతో కూడిన ఆసిఫాబాద్​ ప్రాంతాన్ని రాజ్​గోండులు పాలించారు.
  • రాజ్​గోండులు పాలించిన ఆసిఫాబాద్​ ప్రాంతాన్ని అప్పట్లో జనగావ్​ అని పిలిచేవారు. 
  • నిజాం రాజు 1853లో జనగావ్​ ప్రాంతాన్ని బ్రిటిష్​ వారికి అప్పగించాడు.
  • బ్రిటిష్​, నిజాం సైన్యం దాడులకు వ్యతిరేకంగా రాంజీగోండ్​ నాయకత్వంలో గోండులు ఎదురు తిరిగారు.
  • రాంజీ నాయకత్వంలో గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను బ్రిటిష్​ ప్రభుత్వం కల్నల్​ రాబర్ట్​కు అప్పజెప్పింది.
  • రాంజీగోండ్​, అతని 1000 మంది సహచరులను కల్నల్​ రాబర్ట్​ బంధించి 1857 ఏప్రిల్​ 9న ఉరి తీశాడు.
  • రాంజీ గోండ్​ సహా 1000 మందిని నిర్మల్​ వద్ద ఉరి తీసిన మర్రిచెట్టు వెయ్యి ఉరుల మర్రిగా ప్రసిద్ధి చెందింది.
  • నిజాం అధికారులు, జాగీర్​దార్లు అకృత్యాలను భరించలేక జాగీర్దార్​ సిద్ధిఖీని కొమరం భీం చంపేశాడు.
  • జాగీర్దార్​ను హత్య చేసి అనంతరం కొమరం భీం అసోం వెళ్లిపోయాడు.
  • అసోం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొమరం భీమ్​ జల్​, జంగల్​, జమీన్​ నినాదం ఇచ్చాడు.
  • కొమరం భీం గెరిల్లా సైన్యాన్ని జోడేఘాట్​ అటవీ ప్రాంతంలో రూపొందించాడు.
  • కోమరం భీమ్​ వర్ధంతిని స్థానిక గిరిజనులు దసరా వెళ్లిన మొదటి పున్నమి రోజున జరుపుకుంటారు.
  • కోమరం భీమ్​ మరణించిన ప్రాంతం జోడేఘాట్
  • 1/70 గిరిజన చట్టం రూపకల్పనకు స్ఫూర్తి కొమరం భీమ్​ పోరాటం.
  • కొమరం భీమ్​ మరణానంతరం నిజాం గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్​ సి.ఎఫ్​. హైమన్​ డార్ఫ్​ను నియమించింది.