ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కలకలం

 ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కలకలం

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారం క్రితం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కైలాష్ టెక్డి సమీపంలో బాంబ్ స్క్వాడ్ గ్రనేడ్ ను గుర్తించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మరిన్ని బలగాలను రప్పిస్తున్నట్టు సమాచారం. రెండేళ్ల తర్వాత మావోలు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. 2020 సెప్టెంబర్ లో కడంబ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మిగతా దళ సభ్యులు తప్పించుకొని ఛత్తీస్ ఘడ్ వైపు వెళ్లిపోయినట్టు అప్పట్లో పోలీసులు చెప్పారు. 

మావోల కదలికలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్ జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మావోయిస్టులకు సహకరించవద్దని, సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు చెప్పాలని సూచిస్తున్నారు.మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ దళం గత కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. భాస్కర్ దళంలో ఉన్న 10 మంది మావోలపై 95 లక్షల రివార్డును పోలీసులు  ప్రకటించారు.