
- రైల్వే ఆఫీసర్లతో ఎంపీ చామల
యాదాద్రి, వెలుగు: ఎంఎంటీఎస్ రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి రైల్వే అధికారులను కోరారు. సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో కలిసి వినతిపత్రం అందించారు.
ఘట్కేసర్ భువనగిరి వరకూ ఏర్పాటు చేసే రైల్వే లైను కోసం భూ సేకరణను స్పీడప్ చేయాలని, రామన్నపేటలో ఫలక్నుమా, శబరి, నారాయణాద్రి రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. అనంతరం భూ సేకరణ అంశంపై మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మీటింగ్లో ఎస్సీఆర్ ఏజీఎం ఉదయనాథ్ కోట్ల, ఎంఎంటీఎస్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్ ఉన్నారు.