త్వరలో సీఎం కూతురు జైలుకు : ఎంపీ అర్వింద్ 

త్వరలో సీఎం కూతురు జైలుకు : ఎంపీ అర్వింద్ 

త్వరలోనే ముఖ్యమంత్రి కూతురు తీహార్ జైలుకు వెళ్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజీపీ ప్రజల పార్టీ.. ప్రజల కోసమే పని చేసే పార్టీ అని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోవని, బీఆర్ఎస్ శ్వాస మాత్రం ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక నిర్మాణాల్లో 75 శాతం నిధులు కేంద్రానివే అని చెప్పారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అర్వింద్ ఈ కామెంట్స్ చేశారు.