ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు : ఎంపీ డీకే అరుణ

ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు : ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. సోమవారం రూరల్  మండలం మాచన్ పల్లి గ్రామంలో  ప్రధానిగా మోదీ 11 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘విక సిత్  భారత్’ సంకల్ప సభకు రాష్ట్ర నాయకుడు జితేందర్ కుమార్ తో కలిసి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వృద్ధులకు రూ.4 వేల ఫించన్​ ఇస్తామని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడేమో ఎక్కడికి పోయినా అప్పు పుట్టే పరిస్థితి లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారని విమర్శించారు.

 కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేసిందని చెప్పారు. కేంద్రం ఐదు కిలోల రేషన్​ బియ్యం ఉచితంగా ఇస్తుందని, ఒక్క కిలో అదనంగా ఇచ్చిన తామే రేషన్​ బియ్యం ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీలు వేసి కాంగ్రెస్​ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పాండురంగారెడ్డి, జయశ్రీ, అచ్చిగట్ల అంజయ్య 
పాల్గొన్నారు.

 చదువుకు మించిన సంపద లేదు

చదువుకు మించిన సంపద లేదని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే పోటీతత్వంతో చదువుతారని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పట్టణంలోని షాషాగుట్ట ప్రభుత్వ పాఠ‌‌‌‌శాల‌‌‌‌లో  నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. 2047 వరకు దేశాన్ని విక‌‌‌‌సిత్  సంక‌‌‌‌ల్ప్  భార‌‌‌‌త్ గా తీర్చి దిద్దడంలో విద్యార్థులు త‌‌‌‌మవంతు పాత్ర పోషించాలని సూచించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. రెడ్ క్రాస్  సొసైటీ చైర్మన్  నటరాజ్  పాల్గొన్నారు.