దారుణం.. చిన్న పిల్లలతో క్లాస్రూం క్లీన్ చేయించారు.. వీడియో వైరల్

దారుణం.. చిన్న పిల్లలతో క్లాస్రూం క్లీన్ చేయించారు.. వీడియో వైరల్

ఏ పేరెంట్స్​ అయినా తమ పిల్లలు చదువుకొని విద్యాబుద్ధులు  నేర్చుకొని ప్రయోజకులు కావాలని స్కూల్​ కి పంపిస్తారు.. తమ పిల్లల ఎదుగుదలను కోరుకుంటారు.  కానీ ఇక్కడ సీన్​ రివర్స్​ అయింది. బడికి వెళ్లి తమ పిల్లలు చదువుకుంటున్నారనుకున్న పేరెంట్స్​ షాక్​ ఇచ్చింది. పాఠశాలలో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి ఇది సాక్ష్యం..వివరాల్లోకి వెళితే..  

మధ్యప్రదేశ్​ లోని ఓ గవర్నమెంట్​ స్కూల్లో చిన్న పిల్లలు (విద్యార్థులు) క్లాస్​రూం ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఛతర్​ పూర్​  జిల్లాలో ఈఘటన జరిగింది. యూనిఫాంలో ఉన్న విద్యార్థులు చీపురు, తుడుపు కర్రతో క్లాస్​ రూం ఫ్లోర్​ను శుభ్రం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో అటుపేరెంట్స్, నెటిజన్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఘటన ఛతర్‌పూర్‌లోని కలెక్టర్ బంగ్లా ఎదుట ఉన్న డెరాపహడి పాఠశాలలో జరగడం విశేషం.  

►ALSO READ | గరీబ్ రథ్ రైలులో భారీగా మంటలు..మూడు బోగీలు కాలిపోయాయ్

నలుగురు విద్యార్థులు క్లాస్​ రూం క్లీన్​చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ముగ్గురు అమ్మాయిలు నేలను శుభ్రం చేస్తుండగా ఓ బాలుడు సాయంచేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ తల్లిదండ్రులు అయినా  తమ పిల్లలు చక్కగా చదువుకొని విద్యాబుద్దులు నేర్చుకోవాలని బడికి పంపిస్తారు.. కానీ వారిని ఈ పరిస్థితుల్లో చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. పాఠశాల సమయాల్లో పిల్లలను పని చేయించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

ఈ ఘటన కొత్తేమి కాదు.. గతంలో కూడా ఛతర్​ పూర్​ కొన్ని సంఘటనలు జరిగాయి. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విధులు మర్చి తరగతి గదిలో బెంచి పై నిద్ర పోయాడు.  దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో బాగా వైరల్​ అయింది.