
- ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డిజిటల్ లైబ్రరీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. మంగళవారం నాగర్కర్నూల్పట్టణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.3.67 లక్షలతో కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం నాగర్కర్నూల్మున్సిపల్పరిధిలో ఉయ్యలవాడ బీసీ గురుకుల పాఠశాలను ఎంపీ, ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో రూ.6.70 లక్షలతో నిర్మించిన మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ
కందనూలు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు.