
- మున్సిపాలిటీకి అంబులెన్స్ అందజేత
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎంపీ రఘునందన్రావు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెల్లాపూర్ మున్సిపాలిటీకి అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ను ఆయన గురువారం అందజేశారు. అనంతరం నైబర్ వుడ్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కాలనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందరర్భంగా మాట్లాడుతూ అన్ని గేటెడ్ కమ్యూనిటీలలో ప్రభుత్వం తరపున అందాల్సిన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.
ఈ నెల 26 న సమావేశం నిర్వహించి తెల్లాపూర్ వాసుల సమస్యలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు కీలక ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీ ప్రజలు అంబులెన్స్ సేవల కోసం 7386759108 నెంబర్కు కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్కమిషనర్ అజయ్ కుమార్రెడ్డి, బీజేపీ మున్సిపల్అధ్యక్షుడు రాంబాబు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, నైబర్ వుడ్స్ ప్రెసిడెంట్ రమణ, డీఈఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, మేనేజర్ అఖిల్, నాయకులు రాజు, శ్రీశైలం, రాజేందర్రెడ్డి, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.