
శివసేన ఎంపీ ఆరోపణ.. కాంగ్రెస్ మండిపడడంతో సారీ!
ముంబై, పుణే: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తాను చేసిన కామెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం చెప్పారు. ఇందిరను కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని, తన కామెంట్స్వల్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలంటూ పేర్కొన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో కొందరు ఇందిరాగాంధీని అవమానించేలా మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా సైలెంట్గనే ఉన్నరు. కానీ నేను ఊరుకోలేదు. ఇందిర తరఫున మాట్లాడాను. అలాంటిది ఇప్పుడు నేనే ఆమెను కించపరుస్తానా?’ అని సంజయ్ ప్రశ్నించారు. ముంబై అండర్ వరల్డ్డాన్ కరీంలాలాను ఇందిర కలుసుకునే వారని సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఇందిరపై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించింది. దీనిపై సంజయ్రౌత్ స్పందిస్తూ.. పఠాన్ కమ్యూనిటీ లీడర్ అయిన కరీం లాలాను ఎంతోమంది నేతలు కలుసుకునేవారని, అందులో ఇందిర కూడా ఉన్నారని చెప్పారు.
సంజయ్ ఏమన్నరంటే..
‘అండర్వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ సెక్రటేరియెట్కు వస్తే ఆయనను కలుసుకునేందుకు నేతలు, అధికారులు కిందికి దిగివచ్చేవారు. మరో డాన్ కరీంలాలానుఇందిరా గాంధీ దక్షిణ ముంబైలో కలుసుకునే వారు. ముంబై మున్సిపల్ కమిషనర్గా ఎవరుండాలనేది అండర్ వరల్డ్లీడర్లే నిర్ణయించేవారు’ అని సంజయ్ రౌత్ చెప్పారు. ఇందిరా గాంధీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు అండర్ వరల్డ్ఆర్థిక సాయం చేసిందేమోనని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ అనుమానం వ్యక్తంచేశారు.