
బోథ్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ తనకు పనులు ఇప్పిస్తానని ఆశ చూపి డబ్బులు తీసుకొని ముంచాడని అదే పార్టీకి చెందిన వైఎస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎంపీపీ తుల శ్రీనివాస్ తన వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశాడని లింబాజీ ఆరోపించారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ విషయాన్ని ఆయన వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.