
నిర్మల్, వెలుగు: దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్లోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వికలాంగులు, చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆగస్టు13న నిర్వహించనున్న దివ్యాంగుల మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఎస్ పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ రాజ్, జిల్లా ఇన్చార్జి నాగభూషణ్, నాయకులు సాగర్, బొబ్బిలి శీను, కల్లెడ సాయి, సాయి చంద్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.