బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ముందుగా ఈనెల 28న ‘విష్ణు విన్యాసం’ విడుదలవుతుండగా, మరో వారంలో ‘మృత్యుంజయ్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. వాస్తవానికి ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్ను ఒకరోజు గ్యాప్లో ప్రకటించగా, తాజాగా ‘మృత్యుంజయ్’ ను పోస్ట్ పోన్ చేస్తూ శుక్రవారం కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.
మార్చి 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ సాంగ్స్, హీరోయిన్, కామెడీ లేకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇక వారం గ్యాప్లో రెండు డిఫరెంట్ జానర్ సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
