చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 21), ఇషాన్ కిషన్ ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే తుషార్ దేశ్పాండే బౌలింగ్ లో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై 38 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్(12) కలిసి ఇషాన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ సమయంలో రంగంలోకి దిగిన జడేజా..ఇషాన్ కిషన్ను పెవిలియన్ చేర్చాడు.
సూర్యకుమార్ యాదవ్(1)ను మిచెల్ సాంట్నర్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే గ్రీన్ను జడేజా పెవిలియన్ చేర్చగా.... క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్(2)ను సాంట్నర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తిలక్ వర్మ(22) కొద్దిసేపు విరుచుకుపడినా.. జడేజా బౌలింగ్ లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ను కళ్లు చెదిరే క్యాచ్ తో మగాల ఔట్ చేశాడు. టీమ్ డేవిడ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.... దేశ్ పాండే అతన్ని పెవీలియన్ చేర్చాడు. చివర్లో హృతిక్ షోకీన్ మూడు బౌండరీలు బాదడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, సాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మగాలకు ఒక వికెట్ దక్కింది.