వాంఖడేలో క్రికెట్ వార్ కు ముంబై, హైదరాబాద్ సిద్దమయ్యాయి. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తో డు ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లు సాధించిన కేన్ టీమ్ కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రోహిత్ సేనపై తప్పక గెలవాల్సిన పరిస్థితి. అటు ముంబై.. ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా పోయేదేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది.
మరిన్ని వార్తల కోసం
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శుభవార్త
విజయ్ దేవరకొండపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం