తన ముఖాన్ని అందవిహీనం చేసినందుకు, భారీ నష్టం కలిగించినందుకు ఓ మహిళ బ్యూటీ సెలూన్పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసింది. రూ.17వేల 500 ఖర్చు పెట్టి ఫేషియల్ మసాజ్ ట్రీట్మెంట్ తీసుకున్న ఆ మహిళ.. ముఖం చర్మం కాలిన గాయాలతో దెబ్బతిన్నట్లు ఫిర్యాదులో ఆరోపించింది.
జూన్ 17న అంధేరీలోని కామధేను షాపింగ్ సెంటర్లోని గ్లో లక్స్ సెలూన్లో ఓ మహిళ రూ.17వేల 500 విలువైన హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకుంది. చికిత్స తర్వాత, మహిళ మండుతున్న అనుభూతిని అనుభవించింది. ఈ క్రమంలో ఆమె వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించింది. ముఖంపై మసాజ్ చేయడం వల్ల కాలిన గాయాలు ఏర్పడ్డాయని, ఇవి శాశ్వతంగా ఉండవచ్చన్న డాక్టర్ మాటలకు ఆమె షాక్ కు గురైంది.
ఆ తర్వాత ఆ మహిళ స్థానిక ఎంఎన్ఎస్ కార్పొరేటర్ ప్రశాంత్ రాణే సహాయంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. అయితే తర్వాత తన ట్వీట్ను తొలగించింది.
హైడ్రాఫేషియల్ అంటే ఏమిటి?
హైడ్రాఫేషియల్ అనేది మెడికల్ గ్రేడ్ రీసర్ఫేసింగ్ ట్రీట్మెంట్, ఇది రంధ్రాలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది లైసెన్స్ పొందిన వైద్య వృత్తిపరమైన సౌకర్యాల వద్ద లేదా ధృవీకరించబడిన హైడ్రాఫేషియల్ ఎస్తెటిషియన్ అందుబాటులో ఉన్న చోట మాత్రమే అందించబడుతుంది.
ఈ కేసు బ్యూటీ ట్రీట్మెంట్ల వల్ల కలిగే ప్రమాదాలను, బ్యూటీ సెలూన్లు అందించే సేవల నాణ్యత గురించి చెప్పడాన్ని వివరిస్తోంది.