నుపుర్ శర్మకు ముంబ్రా పోలీసుల సమన్లు

నుపుర్ శర్మకు ముంబ్రా పోలీసుల సమన్లు

నుపుర్ శర్మకు మహారాష్ట్రలోని ముంబ్రా పోలీసులు సమన్లు  జారీ చేశారు. దీనితో జూన్ 22న ఆమె పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. ఆమెపై ముంబ్రా, పైడోనీ, థానేలో కేసులు నమోదయ్యాయి. రజా అకాడమీ ముంబై విభాగం జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దక్షిణ ముంబైలోని పైడోనీ పోలీసులు నూపుర్ శర్మపై కేసు నమోదు చేశారు.

ఇటీవల ఓ టీవీ చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు నుపుర్ శర్మ. అమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందం కావడంతో పలుచోట్లల్లో అల్లర్లు నెలకోన్నాయి.. ఈక్రమంలో బీజేపీ హైకమాండ్ అమెను ఆరెళ్ల పాటు సస్పెండ్ చేస్తూ గత ఆదివారం నిర్ణయం తీసుకుంది. అటు ఢిల్లీ పోలీసులు నూపుర్ శర్మతో పాటుగా అమెకు కుటుంబానికి భద్రత కల్పి్ంచారు.