సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో .. చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్

సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో .. చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​ కోనేటి పుష్పలత(బీఆర్ఎస్) శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్​రెడ్డితో కలిసి హైదరాబాద్​లోని సీఎం నివాసంలో రేవంత్​రెడ్డిని కలిశారు.

 బీఆర్ఎస్ కు చెందిన 7వ వార్డు కౌన్సిలర్​ ఉమా వెంకటయ్య, బీజేపీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్​ లలిత నాగరాజు సైతం కాంగ్రెస్​లో చేరారు. కౌన్సిలర్లు కుమ్మరి రాజు, రహీమోద్దీన్, రమేశ్,చౌహాన్, జడ్చర్ల మాజీ సర్పంచ్​ బుక్క వెంకటేశం ఉన్నారు.