
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో జరిగిన హత్యను చేవేళ్ల పోలీసులు ఛేదించారు. రూ.5వేల కోసం మర్డర్ చేసిన నిందితుడిని రిమాండ్కి తరలించారు. ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ కి బతుకుదెరువుకోసం వచ్చిన సత్తయ్య (40)కి, అదే గ్రామానికి చెందిన ఒగ్గు శివరాజ్అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. గత నెల 29న ఇద్దరూ కల్లు తాగారు. సత్తయ్య దగ్గరున్న 5వేలను శివరాజ్ కాజేయాలనున్నాడు. రాత్రి 8 గంటలప్పుడు బెల్ట్షాపులో మందు తీసుకుని గ్రామ శివారులో తాగారు. ఆ తర్వాత తలపై బండరాయితో బాది సత్తయ్యను శివరాజ్ చంపేశాడు. సత్తయ్య జేబులో సెల్ఫోన్, డబ్బులు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులు సమాచారంతో కేసు ఫైల్ చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించగా సత్యయ్య, శివరాజ్ కలిసి తిరగడం కనిపించింది. శివరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొన్నాడు.