ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్లు అమరేందర్

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్లు అమరేందర్

కందనూలు , వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్,  దేవ సహాయం జిల్లా ఆఫీసర్లకు  సూచించారు.  నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 47 ఫిర్యాదులు అందాయి. 

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  ఫిర్యాదులను పెండింగ్ లో  పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ  సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.  కార్యక్రమంలో  అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.