చిన్న గ్యాప్ అంతే.. సాలిడ్ కంబ్యాక్ ప్లాన్ చేసిన సాయి పల్లవి

చిన్న గ్యాప్ అంతే.. సాలిడ్ కంబ్యాక్ ప్లాన్ చేసిన సాయి పల్లవి

సాయి పల్లవి(Sai pallavi).. నేచురల్ బ్యూటీగా ఆడియన్స్ మనసు దోచేసుకుంది ఈ మలయాళీ భామ. చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసే సాయి పల్లవి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆమె చివరగా తెలుగులో రానా హీరోగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కనిపించారు. ఇక అప్పటి నుండి ఆమె ఫ్యాన్స్ ఆమెను చాలా మిస్ అవుతున్నారు. తన తరువాత సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

వారికీ ఈ మధ్యే గుడ్ న్యూస్ చెప్పింది సాయి పల్లవి. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga chaitanya)తో తన తరువాతి సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు కార్తికేయ దర్శకుడు చందు మొండేటి(chandu mondeti) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఒకే చేశారు సాయి పల్లవి. కమల్ హాసన్ నిర్మాణంలో తమిళస్టార్ శివ కార్తికేయ హీరోగా వస్తున్న సినిమాలో సాయి పల్లవిను ఒకే చేశారు మేకర్స్. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. 

ఈ రెండు సినిమాలు దేనికది చాలా ప్రత్యేకం. సాయి పల్లవి ఒక సినిమాను ఒకే చేసింది అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఎదో కొత్తదనం ఉండే ఉంటుంది. అందుకే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కొంత గ్యాప్ తరువాత వస్తున్నా.. మంచి సాలిడ్ కంబ్యాక్ ను ప్లాన్ చేసుకుంది సాయి పల్లవి. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Also Read :- ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గోల ఏంటీ.. ఎందుకు ట్రైండింగ్ లో ఉందంటే