పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగారు. ఈ మేరకు సోనియా గాంధీకి రాజీనామా లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసింది. పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. కేవలం 18 సీట్లతో సరిపెట్టుకుంది. దీనిపై సీరియస్ అయిన అధిష్టానం. ఐదు రాష్ట్రాల పీసీసీల నుంచి రాజీనామాను కోరింది. దీంతో సిద్ధూ ఇవాళ రాజీనామా చేశారు.
మరిన్ని వార్తల కోసం