ఓటీటీలోకి ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్​.. బట్ వన్ కండిషన్!

ఓటీటీలోకి ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్​.. బట్ వన్ కండిషన్!

జయం రవితో కలిసి నయనతార నటించిన సైకలాజికల్​ క్రైమ్​ థ్రిల్లర్​ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ఇరైవన్​, తెలుగులో ‘గాడ్’​ పేరుతో ఈ మూవీ విడుదలైంది. ఐ అహ్మద్​ దీనికి దర్శకుడు. సెప్టెంబర్​లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన రిజల్ట్​ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో గాడ్​ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్​ కానుంది. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​ ఓ పోస్టర్​తో ప్రకటించింది. 

గాడ్ మూవీని పిల్లలతో కలిసి చూడకండి. ఎందుకంటే..ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సీన్స్ కు పిల్లలు భయపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ మూవీ మాస్ ఆడియన్స్కి, క్రైం థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే వారికి మాత్రం పండుగనే చెప్పుకోవాలి. 

నగరంలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్​ను ఎదుర్కొనే కాన్సెప్ట్​తో మూవీని రూపొందించారు. మరి ఈ థ్రిల్లర్​ స్టోరీని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదిరిస్తారో వేచి చూడాలి.