హైదరాబాద్, వెలుగు: ఎన్సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ జూన్ 2023 క్వార్టర్లో రూ. 4,407 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో కంపెనీ రెవెన్యూ రూ. 3,351 కోట్లే. అంటే 32 శాతం పెరిగినట్లు. జూన్ 2023 క్వార్టర్లో ఇబిటా రూ. 409 కోట్లకు, నికర లాభం రూ. 173 కోట్లకు పెరిగినట్లు ఎన్సీసీ లిమిటెడ్ ప్రకటించింది.
జూన్ 2023 క్వార్టర్లో కంపెనీకి రూ. 308 కోట్ల ఇబిటా, రూ. 130 కోట్ల నికర లాభం వచ్చాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్లో రూ. 8,154 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని, దీంతో చేతిలోని మొత్తం ఆర్డర్ల విలువ రూ. 54,110 కోట్లకు పెరిగిందని ఎన్సీసీ లిమిటెడ్ వెల్లడించింది.