ఎన్​సీసీ రెవెన్యూ .. రూ. 4,407 కోట్లు

ఎన్​సీసీ రెవెన్యూ .. రూ. 4,407  కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఎన్​సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్​​ రెవెన్యూ జూన్​ 2023 క్వార్టర్లో రూ. 4,407 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో కంపెనీ రెవెన్యూ రూ. 3,351 కోట్లే. అంటే 32 శాతం పెరిగినట్లు. జూన్​ 2023 క్వార్టర్లో ఇబిటా రూ. 409 కోట్లకు, నికర లాభం రూ. 173 కోట్లకు పెరిగినట్లు ఎన్​సీసీ లిమిటెడ్​ ప్రకటించింది. 

జూన్​ 2023 క్వార్టర్లో కంపెనీకి రూ. 308 కోట్ల ఇబిటా, రూ. 130 కోట్ల నికర లాభం వచ్చాయి. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి క్వార్టర్లో రూ. 8,154 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని, దీంతో చేతిలోని మొత్తం ఆర్డర్ల విలువ రూ. 54,110 కోట్లకు పెరిగిందని ఎన్​సీసీ లిమిటెడ్​ వెల్లడించింది.