ఇండెల్ మనీ నుంచి ఎన్సీడీలు

ఇండెల్ మనీ నుంచి ఎన్సీడీలు

హైదరాబాద్​, వెలుగు: ఎన్​బీఎఫ్​సీ ఇండెల్ మనీ లిమిటెడ్, రూ. 1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్​సీడీల ఆరో పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 13–28 తేదీల మధ్య ఉంటుంది.  ఇందులో రూ. 150 కోట్ల బేస్ ఇష్యూ సైజ్‌‌‌‌‌‌‌‌తో పాటు, అదనంగా రూ. 150 కోట్ల వరకు ఓవర్‌‌‌‌‌‌‌‌సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ ఉంది.

మొత్తం రూ. 300 కోట్ల వరకు సమీకరించవచ్చు. ఈ ఎన్​సీడీలకు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్  ‘ఐవీఆర్​ఏ-/స్టేబుల్’ రేటింగ్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల డబ్బు  72 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని ఇండెల్​మనీ తెలిపింది. ఏటా 12.25 శాతం వడ్డీ చెల్లిస్తారు. కనీసం రూ.10 వేలు ఇన్వెస్ట్​ చేయాలి. ఎన్​సీడీలు బీఎస్​ఈ  లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్​అవుతాయి.