T20 World Cup 2024: లామిచానేకు వీసా నిరాకరణ.. వీధుల్లో అభిమానుల నిరసనలు

T20 World Cup 2024: లామిచానేకు వీసా నిరాకరణ.. వీధుల్లో అభిమానుల నిరసనలు

T20 ప్రపంచ కప్ నేపాల్ స్క్వాడ్ లో సందీప్ లామిచానేకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 2 నుంచి వెస్టిండీస్, యుఎస్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం USA వెళ్లేందుకు నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు US ఎంబసీ వీసా నిరాకరించింది.  ఈ యువ స్పిన్నర్ కు US వీసా నిరాకరించడంతో అభిమానులు నేపాల్ ఖాట్మండు వీధుల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం USAలో ఉన్న నేపాలీ జట్టులో సందీప్ లామిచానే చేరకుండా అడ్డుకున్నారని అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసం బయట అభిమానులు నిరసనలు జరిగాయి. US రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని  వీసా మంజూరు చేయమని ఒత్తిడి చేశారు. 2022 ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక పోలీసులకు చేసింది ఫిర్యాదు చేసింది. ఈ కేసు పూర్వపరాలువిచారించిన ఖాట్మండు జిల్లా కోర్టు.. 2024 జనవరిలో అతన్ని దోషిగా తేలుస్తూ 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే తీర్పులో అత్యాచారం జరిగిన సమయానికి బాధిత బాలిక మైనర్ కాదని, ఆమెకు రూ.2,00,000 నష్టపరిహారం చెల్లించాలని, కోర్టుకు రూ.3,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Also read : T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరుతుంది.. వెస్టిండీస్ దిగ్గజం జోస్యం
 
దీనిని సవాల్ చేస్తూ లామిచానే పైకోర్టుకు వెళ్లగా.. తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.  తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్​ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్.. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతన్ని నిర్దోషిగా తేలుస్తూ.. రేప్ కేసు ఆరోపణల నుండి విముక్తి కల్పించింది.