ముంబై: ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు నేటి నుంచి పెరుగుతున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలని జూన్ 2021లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు రూ. 20 గా ఉన్నాయి. ప్రతీ కస్టమర్కు తన సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు యథాప్రకారం కొనసాగుతాయి. ఇంటర్ ఛేంజ్ ఫీను రూ. 15 నుంచి రూ. 17 కి పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఈ ఇంటర్ ఛేంజ్ ఫీని రూ. 6 కి పెంచింది. ఈ మార్పు గత ఏడాది ఆగస్టు 1 నుంచే అమలులోకి వచ్చింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఛార్జీలను పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఏటీఎం ఛార్జీల రివ్యూ కోసం జూన్ 2019లో ఒక కమిటీని ఆర్బీఐ నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా ఐబీఏ సీఈఓ వ్యవహరించారు. దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులన్నీ కలిపి మార్చి 2021 చివరి నాటికి జారీ చేసిన డెబిట్ కార్డుల సంఖ్య 90 కోట్లు. మన దేశంలోని మొదటి ఏటీఎంను హెచ్ఎస్బీసీ బ్యాంకు 1987లో ముంబైలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 12 ఏళ్లలో 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఇంటరాపరబుల్ ట్రాన్సాక్షన్ల కోసం స్వధన్ నెట్వర్క్ను 1997 లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మొదలు పెట్టింది.
ఏటీఎం ఛార్జీల పెంపు నేటి నుంచే
- బిజినెస్
- January 1, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే.. ఆగమైపోతాం.. తస్మాత్ జాగ్రత్త:హరీష్ రావు
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- పులివెందులలో జగన్ కు లక్ష మెజారిటీ ఖాయం... భారతి
- మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సేవింగ్ స్కీం..తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ
- బంగారు తెలంగాణ కాదు.. నిరుద్యోగ తెలంగాణ: గడ్డం వంశీకృష్ణ
- శ్రీరాముడ్ని అడిగితే కూడా బండి సంజయ్కు ఓటేయద్దంటడు : కేటీఆర్
- Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
- నల్గొండలో రూ.11 కోట్ల 7 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!