
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఛైర్మన్ రంగారావు స్పందించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగారావు తెలిపారు. మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై ఈఆర్సీ తుదితీర్పు వెలువరిస్తుందని వెల్లడించారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని #Telangana ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్-ఈఆర్సీ ఛైర్మన్.. శ్రీరంగారావు తెలిపారు. మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై.. ఈఆర్సీ తుది తీర్పు వెలువరిస్తుందని వెల్లడించారు
— AIR News Hyderabad (@airnews_hyd) March 1, 2022
మరిన్ని వార్తల కోసం: