
కొన్నిసార్లు వాట్సాప్లో ఒకరికి పంపే మెసేజ్ను పొరపాటున మరొకరికి పంపిస్తుంటారు. మెసేజ్ పంపే ముందు కాంటాక్ట్స్లో సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఈ పొరపాటు జరగకుండా ఉండేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ప్రకారం ఫొటోలు, వీడియోలు వంటి మీడియా ఫైల్స్ని యూజర్లకు పంపే ముందు డబుల్ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫీచర్ ప్రకారం మెసేజ్ పంపే ముందు వేరే యూజర్ల ప్రొఫైల్ పిక్చర్ ఎడమవైపు చిన్నగా కనిపిస్తుంది. అయితే కొత్త ఫీచర్లో ఇమేజ్ క్యాప్షన్ కింది భాగంలో సెండ్ చేయాలనుకున్న యూజర్ నేమ్ యాడ్చేయాలి. దీనివల్ల ఆ పేరుపై పూర్తి అప్రమత్తంగా ఉంటారు. ఈ ఫీచర్ ద్వారా ఎవరికి మెసేజ్ పంపాలో వాళ్లకే సెండ్ చేయొచ్చు. గ్రూప్ మెసేజ్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.