న్యూఢిల్లీ: స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి అతి పెద్ద సంస్కరణల ప్రక్రియ మొదలైంది. నేషనల్ కరిక్యూలమ్ ఫ్రేం వర్క్(ఎన్ సీఎఫ్) రివ్యూకు సంబంధించిన ప్రపోజల్ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్ సీఈఆర్ టీ) ప్రారంభించింది. ఎన్సీఎఫ్ రిఫార్మ్స్కు సంబంధించిన ప్రతిపాదనలను సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సమర్పించింది. ఈ నెల మొదట్లో ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం.. 2021 ఏప్రిల్ నాటికి కొత్త సిలబస్ రెడీ అవుతుంది. అప్పుడే కొత్త టెక్స్ట్బుక్స్ తయారీ కూడా మొదలవుతుంది. 2023 నాటికి కొత్త టెక్స్ట్బుక్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్త సిలబస్లో ప్రతి సబ్జెక్ట్లోనూ కంటెంట్ను తగ్గించి కోర్ మ్యాటర్స్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే స్కూల్ సిలబస్లో రిఫార్మ్స్ ఉండనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివరి వారంలో ఈ పాలసీ కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. 15 ఏండ్ల తర్వాత ఎన్సీఎఫ్ ను రివ్యూ చేస్తున్నారు. స్కూళ్లలో చెప్పే కంటెంట్ తో పాటు టీచింగ్ మెథడ్స్పైనా ఎన్సీఎఫ్లో భాగంగా రివ్యూ చేసి అవసరమైన సూచనలు చేస్తారు. ఎన్ సీఈఆర్టీ గత నవంబర్లోనే ఇంటర్నల్గా వర్క్ను మొదలుపెట్టింది. స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రపోజల్స్ సమర్పించింది. నేషనల్ అస్సెస్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్స్ సందర్భంగా దేశమంతటా ఒకే రకమైన అస్సెస్మెంట్, ఎవాల్యూయేషన్ ఉండేలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగానే కొత్త నేషనల్ కరిక్యూలమ్ ఫ్రేంవర్క్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
మామూలు పరిస్థితి వచ్చాకే స్కూల్స్ తెరుస్తాం
ఇప్పటికిప్పుడు బడుల్ని తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే స్కూళ్లను తెరుస్తామని కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ రమేశ్ పొఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. గురువారం జరిగిన లైవ్ వెబినార్లో ఆయన టీచర్లతో మాట్లాడుతూ.. యూనివర్సిటీల రీఓపెన్ అంశంపై ప్రభుత్వం, ఎన్సీఈఆర్టీ, యూజీసీలు పలు ప్లాన్లను రెడీ చేస్తున్నాయని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో సీటుకి సీటుకి మధ్య ఎడం, టైమింగ్స్లో మార్పు, క్లాసుల్ని డివిజన్ అమలులాంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ లెర్నింగ్ ప్రాసెస్ ను అనుసరించాలని మంత్రి టీచర్లను కోరారు.
ఆ స్టూడెంట్స్ కు మరో చాన్స్: సీబీఎస్ఈ
తొమ్మిది, లెవెన్త్ క్లాస్ల్లో ఫెయిలైన విద్యార్థులకు సెకండ్చాన్స్ఇవ్వాలని సెంట్రల్బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. కరోనా క్రైసిస్కారణంగా మరోసారి స్కూల్బేస్డ్ టెస్ట్లు పెడతామని చెప్పింది. 9, 11 క్లాసుల్లో ఫెయిలైన స్టూడెంట్స్ ఆన్లైన్లేదా ఆఫ్లైన్ఎగ్జామ్స్కండక్ట్చేస్తామని సీబీఎస్ఈ కంట్రోలర్సన్యం భరద్వాజ్చెప్పారు.