తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. రాత్రి 12 గంటల సమయానికి చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయం ముందుకు చేరారు. గోవింద నామ స్మరణ చేస్తూ కొత్తేడాదికి ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండేలా చూడాలంటూ శ్రీవారిని వేడుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రార్థించారు.
మరిన్ని వార్తల కోసం: