ఏ కన్నబిడ్డో పాపం..ముళ్ల పొదల్లో పసికందు

ఏ కన్నబిడ్డో పాపం..ముళ్ల పొదల్లో పసికందు

చందానగర్​, వెలుగు : అప్పుడే పుట్టిన ఓ మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఘటన చందానగర్​ పీఎస్​​ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన ప్రకారం.. చందానగర్​పాపిరెడ్డికాలనీ రాజీవ్​గృహకల్ప కాలనీ బ్లాక్​ నెం.27 వద్ద ఉన్న ముళ్లపొదల్లో మంగళవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో  స్థానికులకు పసిపాప ఏడుపు  వినిపించింది.  అక్కడకు వెళ్లి చూడగా మగ శిశువు కనిపించాడు. వెంటనే చందానగర్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసిపాపను నిలోఫర్​హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అనంతరం యూసఫ్​గూడలోని శిశు విహార్​కు అప్పగించారు. పసికందు జన్మించి ఒక రోజు అయి ఉండొచ్చని తెలుస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టినట్లు,  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్​ రవీందర్ ​తెలిపారు.