తెలంగాణలో మరో 1,481 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,481 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,481 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,319కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,451 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,14,917గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,916 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. 14,883 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 40,081 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,55,597 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.78 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 279, మేడ్చల్ 138, రంగారెడ్డి 111, ఖమ్మం 82, నల్గొండ 82, భద్రాద్రి 79, కరీంనగర్ 79, సూర్యపేట్ 47, వరంగల్ అర్బన్ 45, సిద్ధిపేట్ 40, జగిత్యాల్ 38, కామారెడ్డి 38, మహబూబ్ నగర్ 35 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

రైతులకు పంట నష్టం కేంద్రమిస్తేనే.. మేమిస్తం

యాసంగిలో ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో చెప్పిన ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు