సలార్ మూవీ ఫస్ట్ టికెట్‌‌ను కొనుగోలు చేసిన డైరెక్టర్

సలార్ మూవీ ఫస్ట్ టికెట్‌‌ను కొనుగోలు చేసిన డైరెక్టర్

డిసెంబర్ 22న విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తున్నారు. వారిలో రాజమౌళి కూడా ఉన్నారు. నైజాంలో ఫస్ట్ టికెట్‌‌ను ఆయన కొనుగోలు చేశారు.  హైదరాబాద్‌‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌లోని  సంధ్య  70 ఎంఎంలో ఉదయం ఏడు గంటల షో కోసం రాజమౌళి టికెట్‌‌ను కొనుగోలు చేశారు.

నైజాంలో ఈ సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ ఫోటోను షేర్ చేసింది. ఇందులో రాజమౌళి తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, నవీన్ యెర్నేని, హోంబలే  ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్‌‌ ఉన్నారు.