నిజామాబాద్, వెలుగు: కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. మంగళవారం సాయంత్రం గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్కు అదనపు కమిషనర్గా వినయ్కృష్ణారెడ్డిని నియమించింది. ఈ ఏడాది జూన్ 13న కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వినయ్కృష్ణారెడ్డి అనూహ్యంగా బదిలీ కావడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఆరు నెలల కింద వచ్చిన ఆయన తన బదిలీ ఊహించలేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు వెళ్లొచ్చిన ఆయనకు బదిలీ సమాచారం తెలిసింది. జిల్లాలో కలెక్టర్ బాధ్యతలు స్వీకరించాక వినయ్కృష్ణారెడ్డి వారంలో దాదాపు ఐదు రోజులు ఫీల్డ్ విజిట్కు వెళ్లేవారు. మధ్యాహ్నం నుంచి ఆఫీస్లో ఉండేవారు. ట్రాన్స్ఫర్పై వెళ్తున్న వినయ్కృష్ణారెడ్డి స్థానంలో 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నుంచి వస్తున్నారు.
