నిజామాబాద్, వెలుగు: భీంగల్, కమ్మర్ పల్లి మండల కేంద్రాల్లోని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి జి.నవిత తనిఖీ చేశారు. కారా బూందీ తయారు చేస్తున్న యూనిట్లు, కిరాణా సూపర్ మార్కెట్లలోని ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్లలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. లైసెన్స్ లేని షాపులతోపాటు శుభ్రత పాటించని దుకాణాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఆమె వెంట అధికారిణి టి.సునీత ఉన్నారు.
