మూడు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాం : జీవన్ రెడ్డి

మూడు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాం : జీవన్ రెడ్డి
  •     అర్వింద్...​పసుపు బోర్డు సంగతి ఏమైంది? 
  •     నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కోరుట్ల, వెలుగు : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలోని 3 చక్కెర ఫ్యాక్టరీలను ఓపెన్​చేస్తామని ఎమ్మెల్సీ , నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్లలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.  అన్ని ధరలను పెంచిన ఘనత బీజేపీదేనని అన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన , ప్రమాదం బారిన పడ్డ గల్ఫ్ కార్మికులకు రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని, వారి పిల్లల చదువుకు, ఉచితంగా వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు.

బీడీ కార్మికుల సంక్షేమానికి కటాఫ్ లేకుండా రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.  2015 లో ఎంపీ కవిత , ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు టైంలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. మళ్లీ ప్రారంభించేందుకు అవకాశం ఉన్నా ఎంపీ అర్వింద్​పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్లీ ప్రారంభించడానికి కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, ముత్యంపేటలోనూ ప్రారంభించి 2025 చివరికల్లా చెరుకు క్రషింగ్​ మొదలుపెట్టి తీరతామన్నారు. - పసుపు బోర్డు ఏర్పాటు ఏమైందని ఎంపీ అర్వింద్​ను ప్రశ్నించారు.

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి జువ్వాడి నర్సింగరావు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జువ్వాడి కృష్ణారావు , నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెద్దెల్లి ప్రకాష్ , కొమిరెడ్డి కరం, విజయ్ ఆజాద్, కల్వకుంట్ల సుజిత్ రావు, టౌన్, మండల అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కొంతం రాజం పాల్గొన్నారు.