ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండిసి టార్గెట్ ను అందుకుంటుంది

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండిసి టార్గెట్ ను అందుకుంటుంది

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 46 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల ఐరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తిని సాధించాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు ప్రభుత్వరంగ మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండిసి లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. పోయిన ఏడాదితో పోలిస్తే  ఇది10 శాతం ఎక్కువని కంపెనీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేనేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవ్​ తెలిపారు. ఎన్​ఎండీసీ ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో 25,882 కోట్ల రూపాయల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,42.19 మిలియన్​ టన్నుల ప్రొడక్షన్​,  40.56 మిలియన్​ టన్నుల అమ్మకాలను సాధించింది.  “బచేలి గని, కుమారస్వామి గని,  ఇతర గనులలో  2023 ఆర్థిక సంవత్సరంలో 46 మిలియన్​ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తిని టార్గెట్​గా పెట్టుకున్నాము. ఈ వాల్యూమ్ అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 10 శాతం ఎక్కువ.  

ఈ ఆర్థిక సంవత్సరంలోనూ టార్గెట్లను అందుకుంటామని ఆశిస్తున్నాం ”అని దేవ్​ తాజా యాన్యువల్​ రిపోర్టులో తెలిపారు.   ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మూడు మిలియన్​ టన్నుల స్టీల్ ప్లాంట్ విభజన ప్రస్తుత సంవత్సరంలో పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోందని,  ఇందుకోసం ఇచ్చిన దరఖాస్తును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిందని ఎన్​డీఎంసీ తెలిపింది. ఈశాఖ ఆదేశాల మేరకు ఎన్​ఎండీసీ కూడా సమావేశాలను నిర్వహించింది. 2022 జూన్​లో కంపెనీ అన్​సెక్యూర్డ్​ క్రెడిటార్స్​, షేర్​హోల్డర్ల మీటింగ్స్​ జరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది.  బచెలి గనిలో ఐదవ లైన్ స్క్రీనింగ్  డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిల్ కన్వేయర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్ కోసం ఎన్​ఎండీసీ కొత్త కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించింది. ఇది ప్రస్తుత సంవత్సరంలోనే రెడీ అవుతుందని, దాదాపు 2.5 మిలియన్​ టన్నుల ఉత్పత్తిని అందిస్తుందని సుమిత్​ దేవ్​ అన్నారు.