నాగిరెడ్డిపేట వైస్​ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

నాగిరెడ్డిపేట వైస్​ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగిన వైస్​ ఎంపీపీ దివిటిరాజ్​దాస్‌పై  అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రభాకర్‌‌ ప్రకటించారు.  బీఆర్‌‌ఎస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీ మెంబర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.  గురువారం మండల పరిషత్​ కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్​ అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. మండలంలో  9 మంది ఎంపీటీసీ మెంబర్లు ఉండగా ఆరుగురు బీఆర్​ఎస్​ ఎంపీటీసీ సభ్యులు వైస్​ ఎంపీపీకి వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. వైస్​ ఎంపీపీ దివిటి రాజ్​దాస్​ నాలుగేళ్లుగా నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగారు. అవిశ్వాసం నెగ్గడంతో మండల బీఆర్​ఎస్​ లీడర్లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.