అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానం ఇచ్చేదెప్పుడంటే..

అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానం ఇచ్చేదెప్పుడంటే..

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8, 9 తేదీల్లో జరుగనున్న వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందింది. వివాదాస్పద మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీని మాట్లాడాలని I.N.D.I.A కూటమి చేసిన సమిష్టి ప్రయత్నాల మధ్య ప్రతిపక్షాలు, ట్రెజరీ బెంచ్‌ల మధ్య ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

ఆగస్టు 8 లేదా 9 తేదీలలో లోక్‌సభలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆగస్టు 10 న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని మోడీ సమాధానం ఇస్తారని పలువురు భావిస్తున్నారు.

2014 నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై తొలి అవిశ్వాస తీర్మానం జూలై 20, 2018న ప్రవేశపెట్టగా.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఘన విజయం సాధించింది. 325 మంది ఎంపీలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, కేవలం 126 మంది మద్దతుతో గెలుపొందారు.