
ఆర్టీఐ దరఖాస్తుకు
కేంద్ర హోం శాఖ తెలివిగా రిప్లై
న్యూఢిల్లీ: కాశ్మీర్వ్యాలీలో టెలికమ్యూనికేషన్పై ఆంక్షలు విధించారో, లేదో తమకు తెలియదని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ చేసిన దరఖాస్తుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా సోమవారం సమాధానం ఇచ్చారు. ‘‘జమ్మూకాశ్మీర్లో రాజకీయ నిర్బంధం, టెలికమ్యూనికేషన్పై ఆంక్షలు, శాటిలైట్ సర్వీసుల తాత్కాలికంగా నిలిపివేత.. తదితర అంశాలపై హోం శాఖకు ఎలాంటి సమాచారం లేదు” అని బదులిచ్చారు.
‘‘జమ్మూకాశ్మీర్కు చెందిన ఉత్తర్వులు ఏవైనా.. ఆ రాష్ర్ట ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటాయి. అక్టోబర్ 31 వరకు జమ్మూకాశ్మీర్ఒక రాష్ర్టంగానే ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మనుగడలోకి వస్తుంది. దాని ప్రకారం.. ప్రస్తుతం కాశ్మీర్ఒక రాష్ర్టం కాబట్టి అక్కడ ఆర్టీఐ పని చేయదు” అని దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చారు.