- రిపోర్టులు ఇచ్చుడూ లేటే
- టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్న సిబ్బంది
- 24 గంటలు పని చేయాల్సి ఉన్నా సాయంత్రానికే బంద్
- ఆదివారం, పబ్లిక్ హాలిడేస్లో మొత్తానికి తెరుస్తలేరు
మహబూబ్నగర్, వెలుగు : తెలంగాణ డయాగ్నస్టిక్హబ్(టి -హబ్)లు పూర్తిస్థాయిలో ఉపయోగపడ్తలేవు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 57 రకాల టెస్టులను ఫ్రీగా చేయాలని ఈ సెంటర్లను స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినా, చాలా చోట్ల అన్ని పరీక్షలు చేయడం లేదు. టెస్ట్ రిపోర్ట్స్మెసేజ్ కూడా పేషంట్ల ఫోన్ నంబర్లకు ఇన్టైంలో రావడం లేదు. దీంతో శాంపిల్స్ ఇచ్చిన వారు పీహెచ్సీలు, సీహెచ్సీలు, యూసీహెచ్ఎస్లకు వెళ్లి రిపోర్టులు తెచ్చుకోవాల్సి వస్తోంది.
14 జిల్లాల్లో అమలు
రాష్ర్టంలో కరీంనగర్, జగిత్యాల, మెదక్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, భదాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మహబూబ్నగర్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో గతేడాది నుంచి తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లను సర్కారు ప్రారంభించింది. మిగతా జిల్లాల్లో వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ప్రస్తుతం బిల్డింగ్ కన్స్ర్టక్షన్ వర్క్స్ సాగుతున్నాయి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న టి -హబ్లకు శాంపిల్స్ తీసుకువచ్చేందుకు ప్రతి జిల్లాకు నాలుగు నుంచి ఐదు వెహికిల్స్ సమకూర్చారు. ప్రతి జిల్లాలోని సీహెచ్సీ, పీహెచ్సీ, యూసీహెచ్ఎస్లకు వచ్చే పేషంట్లను ముందుగా పరీక్షిస్తారు. అక్కడ వారికి టెస్టులు అవసరమైతే శాంపిల్స్ తీసుకుని, టి హబ్కు సంబంధించిన వెహికిల్స్ వచ్చాక ఇచ్చి పంపిస్తున్నారు. అక్కడి స్టాఫ్ శాంపిల్స్కలెక్ట్ చేసుకొని టెస్టులు చేస్తారు. రిజల్ట్స్ వచ్చాక పేషంట్ సెల్కు మెసేజ్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. కానీ, రిపోర్ట్స్ఆన్లైన్లో అప్లోడ్ చేసే టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. దీంతో కొందరికి మెసేజ్లు రావడం లేదు. మరికొంతమందికి లేట్గా వస్తున్నాయి. అత్యవసరమైనవారు డైరెక్ట్గా శాంపిల్స్ ఇచ్చిన సెంటర్లకే వెళ్లి రిపోర్టులు తెచ్చుకుంటున్నారు.
ఆ పది రకాల టెస్టులు చేస్తలేరు
టి- హబ్ల ద్వారా 57 రకాల టెస్టులు చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల 44 నుంచి 47 వరకు మాత్రమే చేస్తున్నారు. ఖమ్మం సెంటర్లో 53 రకాల టెస్టులు, కరీంనగర్లో 44 , మహబూబాబాద్లో 47 , జనగాంలో 53 , పాలమూరులో 44 , భద్రాది కొత్తగూడెంలో 54 , ఆసిఫాబాద్లో 45 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. థైరాయిడ్, ఎలెక్ట్రోలైట్, సీరమ్ సోడియం, సీరమ్ పొటాషియం, సీరమ్ క్లోరైడ్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), స్టూల్ టెస్టింగ్ ఫర్ బ్లడ్, కాంబస్ డైరెక్ట్, కాంబస్ ఇన్డైరెక్ట్, హెచ్బీఏ1సీ, ఓరల్ గ్లుకోజ్, ఎల్డీహెచ్ టెస్టులు చేయడం లేదు. వీటికి సంబంధించి ఎక్విప్మెంట్, కెమికల్స్ అందుబాటులో లేవని, అందుకే చేయడం లేదని స్టాఫ్ చెబుతున్నారు.
ఈవినింగ్ క్లోజ్.. సండే బంద్
సెంటర్లు 24 గంటలు పని చేస్తాయని సర్కారు చెబుతున్నా, ఫీల్డ్లెవెల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపే మూసేస్తున్నారు. ఆదివారాల్లో అసలే తెరవట్లేదు. పబ్లిక్ హాలిడేస్ టైంలోనూ ఇదే పరిస్థితి. జగిత్యాలలో ల్యాబ్ ఇన్చార్జి ఐదు గంటల వరకు ఉంటుండగా, స్టాఫ్ ఏడు గంటలకు క్లోజ్ చేసి పోతున్నారు. సండే బంద్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ సెంటర్ను రాత్రి తొమ్మిదింటి లోపు క్లోజ్ చేస్తుండగా, ఆదివారం తెరవడం లేదు. నిర్మల్ సెంటర్ను పది గంటలకు తెరిచి సాయంత్రం నాలుగు గంటల వరకే రన్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో వచ్చిన శాంపిల్స్ టెస్ట్చేయడం ఎప్పుడైపోతే అప్పుడే మూసిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం సెంటర్కు సాయంత్రానికే తాళం వేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో టి హబ్ సెంటర్ను సండేస్తో పాటు పబ్లిక్ హాలిడేస్లో కూడా తెరవడం లేదు. పాలమూరులో పది రోజుల కిందటి వరకు ఐదు గంటలకే బంద్ పెట్టగా, ఇటీవల హెల్త్ మినిస్టర్24 గంటలూ తెరిచే ఉంచాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది అదనంగా రెండు గంటలు ఉండి ఏడు గంటలకే వెళ్లిపోతున్నారు. కరీంనగర్, మహబూబాబాద్ సెంటర్లలో సండే హాలీడే పాటిస్తుండగా, ఖమ్మం సెంటర్లో రాత్రి తొమ్మిదింటికి తాళం వేస్తున్నారు. ఎక్కువ సెంటర్లలో ఏడు గంటల తర్వాత వచ్చే శాంపిల్స్ను పరీక్షించడం లేదు. టెక్నీషియన్లు మరుసటి రోజు వచ్చి టెస్ట్ చేస్తున్నారు. దీంతో లేట్ అవుతుండడంతో అత్యవసరమైన వారు మళ్లీ ప్రైవేట్ ల్యాబ్లనే ఆశ్రయిస్తున్నారు.
వనపర్తి లో టెస్టులే చేయట్లే
వనపర్తిలో టి-హబ్ సెంటర్లో అసలు టెస్టులే చేయడం లేదు. ఈ జిల్లా పరిధిలోని పీహెచ్సీలు, సీహెచ్సీల నుంచి వచ్చే కొన్ని శాంపిల్స్ను పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా సెంటర్కు పంపిస్తున్నారు. అక్కడ సిబ్బంది వీటిని పరీక్షించి, రిపోర్టులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేసరికి మూడు రోజులు పడుతోంది. వనపర్తి జిల్లాలో ఈ సెంటర్ను ప్రారంభించినప్పటి నుంచి ఇదే సమస్య వెంటాడుతోంది. సిబ్బంది కొరతతో ఇక్కడ టి-హబ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. ఇటీవల 104 సేవలను గవర్నమెంట్ రద్దు చేయగా, వాటిలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నిషీయన్లను ఇతర చోట్ల అలాట్ చేస్తామని చెప్పినా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్
టి -హబ్లో సిబ్బంది కొరత ఉంది