
వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీరుపై హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన పాల్గొంటున్న మీటింగ్స్లో మాస్కులు పెట్టుకోకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో వైరస్ ఇతరులకు సోకే డేంజర్ ఉందంటున్నారు. శుక్రవారం వైట్హౌస్ లాన్లో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ ఈవెంట్తో విమర్శలు మరింత పెరిగాయి. దాదాపు 1,500 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఎక్కువ శాతం మంది మాస్కులు పెట్టుకోలేదు. సీటింగ్ విషయంలో కూడా కరోనా రూల్స్ ఫాలో కాలేదు. కనీసం ఒక్కొక్కరి మధ్యా 6 అడుగుల దూరం పాటించాల్సి ఉండగా.. కొన్ని అంగుళాల దూరం కూడా వదల్లేదు. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేసేందుకు ట్రంప్ ఈ ఈవెంట్లోనే ఓకే చెప్పారు. మీటింగ్కు వచ్చిన పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్స్ మాత్రమే మాస్కులు పెట్టుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. పార్టీ కన్వెన్షన్లో సేఫ్టీ ప్రొటోకాల్స్ను అమలు చేశామన్నారు. మీటింగ్కు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేశామని తెలిపారు. శుక్రవారం రాత్రి న్యూహ్యాంప్షైర్లో ట్రంప్ హాజరైన ఈవెంట్లో కూడా చాలామంది మాస్క్పెట్టుకోలేదు. ‘‘ఇప్పటికే చాలా మందికి వైరస్ వచ్చింది. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఆ విషయం వాళ్లక్కూడా తెలియదు. కానీ వీరి నుంచి వేరే వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది”అని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు