బిలియనీర్లు తగ్గిన్రు.. ఇప్పుడు 136 మందే

బిలియనీర్లు తగ్గిన్రు.. ఇప్పుడు 136 మందే

న్యూఢిల్లీ : మన దేశంలో బిలియనీర్లు తగ్గారు. 2019–20లో 141 మంది బిలియనీర్లు ఉండగా, 2020–21 నాటికి 136 మందికి తగ్గిపోయారు. ఇన్​కంటాక్స్​ రిటర్న్​లోని గ్రాస్​ టోటల్​ ఇన్​కం ఆధారంగా బిలియనీర్ల సంఖ్య లెక్కకట్టినట్లు ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ మంగళవారం పార్లమెంట్​కు వెల్లడించారు.2018–19లో 77 మంది మాత్రమే రూ. 100 కోట్లకు (ఒక బిలియన్​) మించి టోటల్​ ఇన్​కం ప్రకటించినట్లు తెలిపారు. డైరెక్ట్​ టాక్సెస్​ కింద  బిలియనీర్ల పదానికి​ డెఫినిషన్​ ఏదీ సీబీడీటీ వద్ద లేదని,  ఎందుకంటే 2016 లో వెల్త్​ టాక్స్​ను రద్దు చేయడంతో పూర్తి ఇన్ఫర్మేషన్​ను సీబీడీటీ సేకరించడం లేదని స్పష్టం చేశారు. పేదరికం గురించి ప్రస్తావిస్తూ, టెండూలర్కర్​ కమిటీ మెథడాలజీ ప్రకారం దేశంలో 2011–12 నాటికి 27 కోట్ల మంది బిలో పావర్టీ లైన్​(బీపీఎల్​) ప్రజలు ఉన్నారని మంత్రి చెప్పారు.    ఇన్​ఫ్లేషన్​ను ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తున్నామని,  ఫుడ్​ ప్రొడక్ట్స్​ ధరలను అదుపులో ఉంచేందుకు తగిన చర్యలనూ తీసుకుంటున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. డిమాండ్​– సప్లయ్​లను జాగ్రత్తగా మానిటర్ ​చేస్తున్నామన్నారు. జులై 15 నాటికి  మొత్తం 1.33 లక్షల మందికి కొవిడ్​ 19 ట్రీట్​మెంట్​ కోసం ప్రభుత్వ బ్యాంకులు అన్​సెక్యూర్డ్​ లోన్లను ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.