డిక్సన్​ ప్లాంటులో అల్కాటెల్​ ఫోన్ల తయారీ​

డిక్సన్​ ప్లాంటులో అల్కాటెల్​ ఫోన్ల తయారీ​

న్యూఢిల్లీ: ఫ్రెంచ్ టెక్ బ్రాండ్ ఆల్కాటెల్ ఫోన్ల తయారీ కోసం నెక్ట్స్​సెల్​ ఇండియా... డిక్సన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్కాటెల్ ఏటా 1.2 మిలియన్ స్మార్ట్‌‌‌‌ఫోన్లను తయారు చేయాలని భావిస్తోందని నెక్ట్స్​సెల్​ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అతుల్ వివేక్ తెలిపారు. మొదట ఫోన్లను తయారు చేస్తామని, తదనంతరం ఇతర ఎలక్ట్రానిక్ ​ప్రొడక్టులపై దృష్టి పెడతామని వివేక్ వెల్లడించారు. రాబోయే 8-–10 వారాల్లో భారత్​తయారీ ఆల్కాటెల్ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను కంపెనీ విడుదల చేయాలని కోరుకుంటోందని ఆయన తెలిపారు. 

అల్కాటెల్​ ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌‌‌‌లో తిరిగి వస్తోంది. రీఎంట్రీ కోసం నెక్ట్స్​సెల్​ ఇండియా 30 మిలియన్​ డాలర్ల(సుమారు రూ. 260 కోట్లు) పెట్టుబడి పెట్టింది. రూ. 20వేలు–-రూ. 25వేల ధరల విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. స్టైలస్‌‌‌‌తో స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను విడుదల చేయనుంది. ఇతర బ్రాండ్లు రూ. 80వేల కంటే ఎక్కువ ధరల విభాగంలో స్మార్ట్‌‌‌‌ఫోన్లలో మాత్రమే స్టైలస్​లను ఇస్తున్నాయని  నెక్ట్స్​సెల్ తెలిపింది. 

స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో విక్రయించడానికి ఆల్కాటెల్ ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌లో అసెంబ్లీ లైన్ కోసం 500 మంది పనిచేస్తారని, వీరిలో 200 మంది ప్రత్యేకంగా ఆల్కాటెల్ పరికరాలనే తయారు చేస్తారని నెక్ట్స్​సెల్​ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంశ్​ రతి తెలిపారు.