పంటలను పరిశీలించిన ఆఫీసర్లు

పంటలను పరిశీలించిన ఆఫీసర్లు

బీర్కూర్​, వెలుగు: నకిలీ విత్తనాలతో తాము నష్టపోయామని ఫిర్యాదు చేసిన బీర్కూర్​ మండల కేంద్రానికి చెందిన రైతుల పంట పొలాలను గురువారం అగ్రికల్చర్​ ఆఫీసర్లు పరిశీలించారు.  అనంతరం ఎడీఏ వీర స్వామి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎడీఏ వీరస్వామి మాట్లాడారు.  రైతులు అధైర్య పడవద్దని, ఇక్కడ పరిశీలించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.  గ్రోమోర్​ సిబ్బంది రైతులకు ఇచ్చిన ఆ సీడ్​ ఎలాంటిదో శాస్త్రవేత్తలు  పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.  ఆయన వెంట ఏఓ కమల, రైతులు ఉన్నారు.